T20 World Cup 2022 : ఈ నెల 23న జరిగే మ్యాచ్ లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను ఓడించి 15 ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న టి20 ప్రపంచకప్ ను ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా ప్రపంచకప్ టైటిల్ ను సొంతం చేసుకోవాలని ఉత్కంఠ పోరును మొదలుపెట్టింది. దీని కోసం ఒక సంవత్సరం నుండి భారత్ ప్రాక్టిస్ తీసుకొంటుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియా (Australia) వేదికగా టి20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది.
స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా టి20 సిరీస్ లను ఆడింది. ప్రతి సిరీస్ లోనూ భారతే విజేతగా నిలిచింది. ఇక ఇటీవలె స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో జరిగిన టి20 సిరీస్ ల్లోనూ భారత్ ఘనవిజయం సాధించింది. అయితే బుమ్రా గాయంతో భారత్ నుండి వైదొలగడం ఒక పక్క భాధాకరమైన కూడా గెలవాలనే ఆశయంతో టీమిండియా ప్రాక్టిస్ మాత్రం చాలా భయంకరంగా చేస్తుంది.
ఇక డెత్ బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కాస్త మెరుగుపడితే టీమిండియాకు టి20 ప్రపంచకప్ లో తిరుగులేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడే ఒక అంశాన్ని విస్మరిస్తున్నారు. ఆస్ట్రేలియా గ్రౌండ్స్ భారత మైదానాల కంటే కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. ఇండియాలో బౌండరీల సైజ్ (పిచ్ నుంచి)లు 70 మీటర్లలోపే ఉంటాయి. అదే ఆస్ట్రేలియాలో అయితే 70 నుంచి 80 మీటర్ల మధ్య ఉంటుంది. (PC : TWITTER)
T20 World Cup 2022 :
ఈ మైదానాల కారణంగా ఇండియాలో సిక్సర్లుగా మారినవి ఆస్ట్రేలియాలో క్యాచ్ లు గా మారే అవకాశం ఉంది. దీనిని గుర్తించుకుని భారత్ ప్లేయర్లు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా తేడా జరిగితే ఇక్కడ సిక్సర్ల వర్షం కురిపించిన భారత ప్లేయర్లు ఆసీస్ గ్రౌండ్స్ లో మాత్రం జీరోలుగా మారే అవకాశం ఉంది. (PC : TWITTER) ఈ క్రమంలో ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత టీం రెండు గ్రూపులుగా విడిపోయి.. వాకా పిచ్ పై కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడితే మంచిది. అప్పుడే మనకు పిచ్ లతో పాటు బౌండరీలను క్లియర్ చేసే అంశాలపై ఒక అవగాహన వస్తుందని క్రికెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.