నాచురల్ స్టార్ హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy) ‘శ్యామ్ సింగ రాయ్’ అనే పీరియాడిక్ డ్రామా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. థియేటర్స్ తక్కువుగా ఉన్నా స్థిరమైన కలెక్షన్స్తో అదరగొడుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్ రైట్స్ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగ రాయ్ జనవరి 21న శుక్రవారం రోజునుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏమంటే ఇదే రోజున బాలయ్య అఖండ కూడా హాట్ స్టార్లో స్ట్రీమింగ్కు రానుందని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి ఎంతో గ్రాండ్గా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మించారు.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రం ఓవర్సీస్లో 8 లక్షల యూఎస్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి.. వన్ మిలియన్ మార్క్ వైపు దూసుకు వెళ్తోంది. కలకత్తా నగరం నేపథ్యంలో వింటేజ్ డ్రామాలా సాగిన ఈ శ్యామ్ సింగరాయ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా 22.5 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగి ప్రస్తుతం బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో నడుస్తోంది. నాని ఈ సినిమాలో శ్యామ్సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించారు.
