రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజాగా తాను బాగానే ఉన్నాని సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.ఈ వార్త విన్న మెగా అభిమానులు సినీ ప్రముఖులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
తాజాగా ఈ పోస్టు పై అక్కినేని నాగ చైతన్య స్పందించారు.ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.సాయిధరమ్ తేజ్ కోలుకోవడం తాజాగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ సక్సెస్ అవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
So happy to see this tej !! Lots of love
— chaitanya akkineni (@chay_akkineni) October 3, 2021