Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు బుల్లితెరపై సందడి చేయనున్నారు. మహేష్ ఒక్కడే కాదు.. తొలిసారిగా తన కూతురితో కలిసి డ్యాన్స్ షోలో సందడి చేశాడు. వీరిద్దరికీ ఆ షో నిర్వాహకులు బ్రహ్మరథం పట్టారు. వీరి ఎంట్రీని గ్రాండ్గా అరేంజ్ చేశారు. సితారతో కలిసి మహేష్ కారులో వస్తుండగా వీడియో తీశారు. అనంతరం వారి ఎంట్రీని సైతం ఓ రేంజ్లో చూపించారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో సితార తన డ్యాన్స్తో ఆకట్టుకుంది. సాధారణంగానే మహేశ్ షోలు, ఫంక్షన్లకు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటిది కూతురు సితారతో కలిసి తొలిసారిగా బుల్లితెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
వచ్చే ఆదివారం ఈ షో ప్రసారం కానుంది. జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ షో ఫినాలేకు చేరుకుంది. ఈ ఫినాలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్, ఆయన కూతురు సితార హాజరయ్యారు. ఇప్పటికే సితార తన తండ్రి సినిమాల్లో హిట్ సాంగ్స్తో పాటు ఇతర సినిమాల్లోని హిట్ సాంగ్స్కు స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఆ వీడియోలను మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫినాలే షోలో.. సితార స్టెప్పులు వేయడం.. మహేష్ చాలా ఆసక్తిగా గమనించడం వంటివి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుం కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Mahesh Babu : ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న మూవీ మేకర్స్..
ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో SSMB 28 మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకు ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ ఏడాడి చివరి కల్లా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి.. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు.