మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ ఒకడు . ప్రారంభం నుంచి హిట్ ప్లాపు అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ప్రేక్షకుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా పొందాడు వరుణ్. సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ సినిమా సినిమాకు తాను ఎంచుకునే స్క్రిప్టుల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ . వరుస హిట్ సాంగ్ అందుకుంటున్న వరుణ్ తేజ్ మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాదంట .

ప్రస్తుతం వరుణ్ తేజ్ క్రేజీ లైన్ అప్ సెట్ చేసుకుంటున్నారు .ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో విడుదలకు సిద్ధమైన విషయం అందరికి తెలిసింది. అందుకే మేకర్స్ ఒక్కొక్కటిగా అన్ని పనులను పూర్తి చేస్తున్నారు. ఇటీవలే హై వోల్టేజ్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా పై హైట్ పెంచేశారు. ఇది కూడా మరో కొత్త ప్రయోగం అని చెప్పకనే చెప్పేసారు .
ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంటున్నట్టు తెలిసింది . సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెసన్ యాక్షన్ త్రిల్లర్కు యూ బై ఏ సర్టిఫికెట్స్ కూడా జారీ చేసింది. ఇది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తో కలిసి జోడిగా ఏజెంట్ బ్యూటీ సాక్షి హీరోయిన్ గా నటిస్తున్నారు . మిక్కీ జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ ని బి వి ఎస్ ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ వారు నిర్మిస్తోంది. ఎలాంటి హిట్ అవుతుందో తెలియాలంటే ఆగస్టు 25 వరకు మనం వేచి ఉండాల్సిందే.