Dhoni: మాజీ క్రికెటర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దక్షిణాదిన సినిమాలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. గతంలో CSKకి కెప్టెన్ గా కొనసాగిన ధోనికి చెన్నై అన్నా, తమిళ భాష అన్నా అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఆ ప్రేమను ఇప్పుడు ధోని ఇంకో స్థాయికి తీసుకెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో ఒక సరికొత్త కంపెనీని ప్రారంభించి, ఈ బ్యానర్పై తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలను నిర్మిస్తారని వార్తలు వస్తున్నాయి.
ప్రపంచకప్ విజేత అయిన మహేంద్ర సింగ్ ధోని ఇదివరకే ‘ధోనీ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. రోర్ ఆఫ్ ది లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ది హిడెన్ హిందు వంటి చిన్న తరహా చిత్రాలను ఈ బ్యానర్లో నిర్మించారు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై విడుదలైన మూడు సినిమాలు ఇవే. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని ఈ నిర్మాణ సంస్థని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తమిళం, తెలుగు మరియు మలయాళం భాషలలో సినిమాలను నిర్మించాలని యోచిస్తున్నాడు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోని అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ల నుండి రిటైర్ అయ్యాడు. కానీ ఇప్పటికీ విజయవంతమైన IPL ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్కు నాయకత్వం వహిస్తున్నాడు. క్రికెట్ చరిత్రలో 50 ఓవర్ల ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ICC ఛాంపియన్స్ ట్రోఫీ… ఇలా మూడు ముఖ్యమైన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ధోని.
Dhoni:
మరి ఈ బ్యానర్పై ధోని ఏ సినిమాలు , ఎవరితో తీస్తాడు, ఈ క్రికెట్ దిగ్గజంతో చేతులు కలిపే నటులు ఎవరనేది తెలుసుకోవాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి . ఎందుకంటే ధోని ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మించడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది.