2,845 గ్రామాల్లోని గిరిజన రైతుల కోసం 4,01,405 ఎకరాల పోడు భూములకు పట్టాలు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రకటించారు.
జూన్ 24 నుంచి జూన్ 30 వరకు పోడు భూ పట్టాల పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ల సమావేశంలో సమీక్షించిన ముఖ్యమంత్రి, పట్టా జారీతో మొత్తం 1,50,224 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
రైతుబంధు సాయం కూడా వెంటనే అందేలా భూమి పట్టాలు ఇచ్చిన వెంటనే ప్రతి లబ్ధిదారుడి పేరున బ్యాంకు ఖాతాలు తెరిచేలా గిరిజన సంక్షేమ శాఖ, జిల్లా కలెక్టర్లు సహకరించాలన్నారు.
