యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చేసాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడిన ఈ హీరో ఇప్పుడు ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాతో బరిలోకి దిగారు. చిత్రంలో శర్వానంద్ జోడీగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా చేసింది. ఈ రోజే (మార్చి 4) ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్, స్పెషల్ షోస్ చూసిన నెటిజన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. మరి వారి రిపోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దామా..
ఫ్యామిలీ అంతా కూర్చొని ఫన్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా రూపొందించామని ప్రమోషన్స్లో సినిమా యూనిట్ చెప్పింది. అందుకు తగ్గట్టుగానే సినిమా అప్డేట్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలాగే ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్లు కుస్భూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి భాగం కావడం మరింత ఎట్రాక్టివ్ గా మారింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
అయితే ఈ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమా చూసిన ఆడియన్స్ మిశ్రమంగా స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇది ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కొందరు చెబుతుంటే.. సినిమా కాస్త బోర్ ఫీలింగ్ తెప్పించిందని ఇంకొందరు చెపుతున్నారు.
చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామని అనేవారు కూడా లేక పోలేదు. ఓవరాల్గా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పాలి.
ఫస్టాఫ్ అంతా కామెడీతో సరదాగా సాగిపోతుందని … ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా నవ్వించిందని చెపుతున్నారు. సెకెండాఫ్ యావరేజ్గా ఉందని అంటున్నారు. కామెడీతో పాటు కొన్ని ఎమోషన్స్ కూడా యాడ్ చేసి చూపించారు. క్లైమాక్స్లో డైరెక్టర్ కిశోర్ తిరుమల మార్కు కనిపించిందని చెపుతున్నారు. ఈ సినిమాలో నవ్వులు తప్ప కొత్తగా ఏమీ లేదని, ఇది యావరేజ్ మూవీ అని పేర్కొంటున్నారు కొందరు. శర్వానంద్, రష్మిక మందన కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిందని చెపుతున్నారు. దేవీ శ్రీ బాణీలు ఫర్వాలేదు అనిపించాయట. మొత్తంగా ఈ మూవీ ఎలా ఉంది? జనాలు సినిమా కు కనెక్ట్ అవుతారా? అనేది చూడాలి మరి.