గత కొద్ది రోజుల నుంచి తెలుగు హీరోయిన్ వర్ష బొల్లమ్మ మీద ఆసక్తికరమైన పుకారు ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈమె ఓ నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్లబోతుంది అంటూ సోషల్ మీడియాలో హాట్ గాసిప్ నడుస్తుంది. గత రెండు రోజుల నుంచి ఈ ప్రచారం మరింత విస్తృతం అయ్యింది. ఒక సదరు ప్రొడ్యూసర్ ఎవరనే విషయాన్ని చెప్పకుండా స్వాతిముత్యం సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ బాబుని ఉద్దేశించి ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారనే విషయం ఆమెకి కూడా అర్ధమైంది. ఇక తాజాగా తనపై జరుగుతున్న ఈ ప్రచారానికి వర్ష బొల్లమ్మ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నాకు తెలియకుండానే నాకు కాబోయే వరుడుని చూసినందుకు వెబ్ సైట్స్ వారికి, ఆ గాసిప్ ప్రచారం చేస్తున్న వారికి థాంక్స్ చెబుతున్నా అని కౌంటర్ ఇచ్చింది.
అలాగే ఆ వరుడు ఎవరనేది చెబితే అతన్ని మా పేరెంట్స్ కి కూడా పరిచయం చేస్తానని, అలాగే నేను కూడా పరిచయం చేసుకుంటానని వర్ష తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. అయితే ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, అలా కాకుండా నా పెళ్లి చూడాలని అనిపిస్తే ఓటీటీలో ఉన్న స్వాతిముత్యం సినిమా చూడమని సలహా ఇచ్చింది. దీనిని బట్టి ఆమె పెళ్లి గురించి ప్రచారం అవుతున్న న్యూస్ కేవలం గాసిప్ అనే విషయాన్ని వర్ష తేల్చేసింది.
Naakosam naake theliyakunda Pelli choopulu Chesi oka abbayi ni select chesinanduku anni websites ki thank you 🙏🏻 Aa abbayi evaru ani naaku chepthe, nen kuda maa inti vaallaki cheppestha:)
Prasthuthaniki naa Pelli choopulu choodalante, AHA lo swathimuthyam choodandi. #FAKENEWS pic.twitter.com/luLdwelMVk— Varsha Bollamma (@VarshaBollamma) October 28, 2022
గతంలో ఈషా రెబ్బ మీద కూడా ఇదే రకమైన ప్రచారం మీడియాలో నడిచింది. సురేష్ బాబు ఇంటికి కోడలిగా ఈషా వెళ్లబోతుందనే టాక్ ని తెరపైకి తీసుకొచ్చారు. దానికి ఆమె ఇదే రీతిలో సమాధానం చెప్పి ఆ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒక హీరోతో నటిస్తే వారితో రిలేషన్ లో ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయిందని దీనిని బట్టి అర్ధమవుతుంది.