Srinidhi Shetty : సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే రాసి పెట్టి ఉండాలి. కానీ చేసిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. ఇక దాదాపు ఆ సినిమా హీరో హీరోయిన్లకు తిరుగుండదు. కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్2 చిత్రాలు బాక్సాఫీస్ను ఏ రేంజ్లో షేక్ చేశాయో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యశ్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తరువాత హీరోహీరోయిన్లు ఇద్దరూ తమ రెమ్యునరేషన్ను అమాంతం పెంచేశారు. అయితే యశ్కి వెంటనే మరో సినిమా అవకాశం దొరికింది కానీ శ్రీనిధికి మాత్రం కాస్త టైమ్ పట్టింది.
అయినా సరే అమ్మడు తగ్గేదిలే.. అని కూర్చొంది. నిర్మాతలు సైతం ఈ ముద్దుగుమ్మకి అంత పెద్ద మొత్తంలో సమర్పించుకోలేక మిన్నకుండిపోయారు. ఇక దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు లేనట్టేనని అంతా అనుకున్నారు. కానీ అమ్మడు మాత్రం తమిళ చిత్రం ద్వారా జాక్పాట్ కొట్టేసిందని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో అజయ్ జ్ఞానముత్తు ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రీనిధి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అమ్మడు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన మొదటి తమిళ చిత్రం కోసం ముద్దుగుమ్మ భారీగానే రెమ్యునరేషన్ ఛార్జ్ చేసిందని సమాచారం.
కోబ్రా కోసం శ్రీనిధి ఏకంగా 6-7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్గా వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది కేజీఎఫ్ కోసం తీసుకున్న రెమ్యూనరేషన్కి రెట్టింపు అని తెలుస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో కెఎస్ రవి కుమార్, మృణాళిని రవి, ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్ తదితరులు కూడా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 11, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మధ్య తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న లైగర్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో శ్రీనిధి శెట్టిని అడిగారట.. కానీ ఆమె ఓ రేంజ్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు లైట్ తీసుకున్నారని వినిపించింది. ఇప్పుడు ఈ తమిళ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తే మాత్రం అమ్మడికి తిరుగులేనట్టే.