బంగారం ప్రేమికులకు బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు పైపైకి కదులుతున్నాయి. పసిడి రేటు భారీగా పెరిగింది. బంగారం ధర పెరిగితే.. వెండి కూడా ఇదే దారిలో వెళుతుంది. వెండి ధర రూ.వేలలో పెరిగింది. దీంతో బంగారం, వెండి కొనాలని అనుకునే వారికీ ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో గురువారం బంగారం ధరలు బాగా పెరిగాయి. బంగారం ధరలు ఒక్కరోజులోనే పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1090 మేర పెరిగింది. దీంతో ఇప్పుడు బంగారం రేటు రూ. 52,040కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో ఉంది. రూ.1000 ల ధర పెరిగింది. దీంతో పసిడి రేటు రూ. 47,700కు పెరిగింది. బంగారం ధరల తో పాటు వెండి రేటు కూడా పైకి కదిలింది. వెండి ధర భారీగా పెరిగింది. రూ.2100 పెరిగి రూ. 72,100కు ఎగసింది.